నెల్లూరు జిల్లా సంగం మండలం
సంగం ముంబై జాతియ రహదారి కి సమీపంలోని కావలి కాలువలో ఓ మృతదేహం లభ్యమయింది. కాలువకు సమీపంలోని స్థానికులు చూసి భయాందోళనకు గురై వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని బయటకు తీయించి దర్యాప్తు చేసి సంగం తిరుమన తిప్పకి కాలనీకి చెందిన కొమరగిరి పెంచలయ్య(30)గా గుర్తించారు. వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఈమేరకు మృతికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.