రామకృష్ణ రెడ్డి వార్డెన్ కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే కంభం విజయరామిరెడ్డి పరామర్శ……
మర్రిపాడు.(ఇదినిజం ప్రతినిధి ):
మర్రిపాడు మండలం చుంచులూరు గ్రామంలో ఇటీవల మరణించిన వార్డెన్ కుటుంబాన్ని ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే కంభంవిజయరామిరెడ్డి పరామర్శించారు. గురువారం వార్డెన్ రామకృష్ణ రెడ్డి ఉత్తర క్రియాలలో పాల్గొన్న విజయరామిరెడ్డి వార్డెన్ చిత్రపటానికి పూలమాల వేసి పుష్పంజలి ఘటించారు. అనంతరం వారి కుటుంబసభ్యులతో కాసేపు మాట్లాడి ఓదార్పు నిచ్చారు. వార్డెన్ కు టిడిపి పార్టీ ఫై ఉన్న అభిమానాన్ని గుర్తు చేసుకున్నారు.వార్డెన్ గా విధులు నిర్వహిస్తున్న సమయంలో వివాదారాహితుడిగా మండలంలో మంచి గుర్తింపు పొందారని కొనియాడారు ఆయన వెంట మన్నే దసరద రామిరెడ్డి ఉన్నారు.