idhinijam.com
Newspaper Banner
Date of Publish : 28 February 2026, 4:43 pm Digital Edition : Idhi Nijam Desk

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఒకరోజు ముందుగానే ఎన్టీఆర్ భరోసా  పెన్షన్ పంపిణీ

మేకపాటి మాల్యాద్రి నాయుడు

దుత్తలూరు మండలం నర్రవాడ గ్రామ పంచాయతీ బీసీ కాలనీ లో పింఛన్లు పంపిణీ చేసిన మేకపాటి మాల్యాద్రి నాయుడు భారతీయ జనతా పార్టీ ..నెల్లూరు జిల్లా… కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు..=కూటమి ప్రభుత్వము ముఖ్యమంత్రివర్యులు..! శ్రీ. నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రతిష్టంగా చేపట్టిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమంలో భాగంగా *ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారి ఆదేశానుసారం ఈరోజు నర్రవాడ గ్రామంలో మార్చి నెల పెన్షన్ 1 -3-2026వ తేదీ ఆదివారం కావడం వలన ఒకరోజు ముందుగానే దగ్గర ఉండి ప్రతి ఇంటికి ఉదయం 6 గంటల నుంచి సచివాలయం సిబ్బందితో కలిసి వెళ్లి వృద్ధులకు 4000 వికలాంగులకు 6000 డయాలసిస్ పేషెంట్లకు 10000 పూర్తిగా మంచానికి అంకితమైన వాళ్లకి 15000 ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో అగ్రికల్చర్ అసిస్టెంట్ చంద్రశేఖర్. డిజిటల్ అసిస్టెంట్ కొండప్ప నాయుడు పాల్గొన్నారు..